by సూర్య | Sun, Jan 16, 2022, 09:06 AM
టెస్ట్ కెప్టెన్సీ నుండి విరాట్ కోహ్లీ వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో క్రీడారంగంలో, క్రికెట్ అభిమానుల్లో కలకలం రేగింది. ఇటీవల బీసీసీఐకి కోహ్లీకి మధ్య గ్యాప్ పెరిగిందనేది బహిరంగ రహస్యమే. ఈ మాటెలా ఉన్నా విరాట్ కోహ్లీ చేసిన ఆకస్మిక ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విరాట్ ప్రకటనపై ఏపీలోని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు. ఇలాంటి వార్తను ఖచ్చితంగా ఇప్పుడు మేము వినాలనుకోలేదు. కానీ మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం. భారత్ క్రికెట్ కు మీరు అందించిన సేవలకు మీకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కీలక ఆటగాడిగా బాగా రాణించాలని.. సెంచరీల మీద సెంచరీలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.
Latest News