ఓకే రోజుల్లో ఏపీలో 50వేలకు చేరువలో కరోనా కేసులు

by సూర్య | Sat, Jan 15, 2022, 08:28 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై కరోనా మరోసారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో  కరోనా వ్యాప్తి మళ్లీ అధికమైంది. గడచిన 24 గంటల్లో 35,673 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,955 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 1,103 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,039 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 397 మంది కరోనా నుంచి కోలుకోగా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,01,710 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,64,331 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 22,870కి పెరిగింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,509కి చేరింది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM