కనిపించిన మకరజ్యోతి

by సూర్య | Fri, Jan 14, 2022, 09:20 PM

మకరజ్యోతి జ్యోతిని చూశారు...అయ్యప్పలు పరవశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఈ సాయంత్రం పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో హోరెత్తించారు. కాగా, ఈ నెల 20న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మూసివేయనున్నారు.  ప్రతి ఏడాది భోగి నాడు మకరజ్యోతి దర్శనం ఆనవాయతీగా వస్తోంది. దీన్నే మకరవిళక్కు అని పిలుస్తారు. జ్యోతి కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చి అదృశ్యమవుతుందని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు చెబుతుంటారు.

Latest News

 
పల్నాడు జిల్లాలో నేడు కూడా 144 సెక్షన్ Fri, May 17, 2024, 12:43 PM
ఎవరెస్ట్, ఎండీఎచ్ మసాలాలపై నేపాల్ నిషేధం Fri, May 17, 2024, 12:40 PM
108 వాహనంలో కవలలు జననం Fri, May 17, 2024, 12:32 PM
యువతి అదృశ్యంపై కేసు నమోదు Fri, May 17, 2024, 12:31 PM
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాము Fri, May 17, 2024, 11:49 AM