by సూర్య | Fri, Jan 14, 2022, 09:20 PM
మకరజ్యోతి జ్యోతిని చూశారు...అయ్యప్పలు పరవశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఈ సాయంత్రం పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో హోరెత్తించారు. కాగా, ఈ నెల 20న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మూసివేయనున్నారు. ప్రతి ఏడాది భోగి నాడు మకరజ్యోతి దర్శనం ఆనవాయతీగా వస్తోంది. దీన్నే మకరవిళక్కు అని పిలుస్తారు. జ్యోతి కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చి అదృశ్యమవుతుందని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు చెబుతుంటారు.
Latest News