హిజాబ్‌ ధరించి క్లాస్‌లకు రావడానికి వీల్లేదటా

by సూర్య | Fri, Jan 14, 2022, 09:19 PM

కొన్ని నిర్ణయాలు తీసుకొని పవిత్ర విద్యాలయాలు సైం వివాదాల్లోకి కురుక్కుపోతుంటాయి. తాజాగా అలాంటి ఘటనయే ఒకటి చోటు చేసుకొంది. కర్ణాటకలోని పలు కాలేజీల్లో ముస్లిం విద్యార్థులకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హిజాబ్‌ ధరించి క్లాస్‌లకు రావడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికే మంగళూరు, చిక్క మంగళూరు కాలేజీలు ఈ విధానాన్ని అమలు చేయగా.. ఆ లిస్టులో ఉడుపి కాలేజీ కూడా చేరింది. కాలేజీ నిర్దేశించిన యూనిఫామ్స్ మాత్రమే ధరించాలని కాలేజీ యాజమాన్యాలు ఆదేశించాయి. దీంతో హిజాబ్ ధరించే విద్యార్థులకు ఇకపై క్లాసుల్లోకి ప్రవేశించే ఛాన్స్ లేకుండా పోయింది. గత వారం మంగళూరు కాలేజీలో ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని రైట్ వింగ్ విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. కొంతమంది విద్యార్థులు కాషాయం కలర్ స్వార్ఫ్స్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ముస్లిం సూడెంట్లను హిజాబ్ ధరించగా అనుమతించినప్పుడు కాషాయ కండువాలు ధరించినప్పుడు తమని కూడా అనుమతించాలని డిమాండ్ చేశారు. చిక్క మంగళూరులోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నడిపిస్తున్న బలగాడి గ్రామంలోని కొప్పా తాలూకాలో ఈ ఘటన జరిగింది. కొప్పా కాలేజీలో హిజాబ్ ధరించే మహిళలు క్లాస్‌కు అటెండ్ అవ్వొద్దని కొంతమంది స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.  దీంతో ఆయా కాలేజీ యాజమాన్యాలు దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నాయి. కాలేజీ ప్రతినిధులు ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై దీనిపై చర్చించారు. అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి.. కాలేజీలో ఎవరూ హిజాబ్‌లు, కాషాయ కండువాలు ధరించరాదని ఆదేశించాయి. తలలు కనిపించకుండా స్క్వార్ఫ్‌లు ధరించవచ్చని చెప్పాయి. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కళాశాల నుంచి తొలగిస్తామని హెచ్చరించాయి. అయితే ఇప్పుడు ఉడుపి కాలేజీలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. కాగా గతంలో కూడా మంగళూరులోని ఓ కాలేజీలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అప్పుడు ముస్లిం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM