by సూర్య | Fri, Jan 14, 2022, 01:19 PM
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ప్రచారం నెట్టింట వైరల్ గా మారింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా స్నానం చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించాడు. కాన్పుర్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైథానీ గురువారం తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ఇంటి లోపలికి వెళ్లి స్నానం చేస్తున్న వ్యక్తిని ఎమ్మెల్యే ఓటు అభ్యర్థించారు. స్నానం చేస్తోన్న వ్యక్తితో సురేంద్ర మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Latest News