by సూర్య | Fri, Jan 14, 2022, 01:15 PM
కృష్ణా: కోవిడ్ నియంత్రణలో భాగంగా విధించిన కర్ప్యూ ఆంక్షలను, 144 వ సెక్షన్ నిబంధనల ఉల్లంఘనలను, కర్ఫ్యూ ఆంక్షలను పై విపత్తు చట్టం 2005 ప్రకారం 1 కేసు, జనావాస ప్రదేశాలు, వాణిజ్య - సముదాయాలు, రెస్టారెంట్లు, వాహనదారులు పై చట్టాల ఉల్లంఘనలపై పోలీసుల 2014 చాలనలు నమోదు చేసి రూ. 1, 34, 845 ల జరిమానా విధించారు. అలాగే మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారి పై పోలీసులు 443 చాలనాలు నమోదు చేసి రూ. 53, 160 ల జరిమానా విధించారు. కరోనా వ్యాపి నియంత్రణకు నగర ప్రజలు సహకరించాలని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ తెలియజేశారు.
Latest News