by సూర్య | Fri, Jan 14, 2022, 12:48 PM
భోగి పండుగ సందర్భంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో అమరావతి రైతులు ఏర్పాటు చేసిన అమరావతి ఉద్యమ సెగలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై భోగి మంటలకు అంకురార్పణ చేసి మంటల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవో లను రాజధాని మాజీ శాసనసభ్యులు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు, దళిత జేఏసీ నాయకులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Latest News