by సూర్య | Fri, Jan 14, 2022, 12:45 PM
గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం పెదకాకాని గ్రామం లోని తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న సబ్ వే వద్ద సుమారు 55 సంవత్సరాల వ్యక్తి మృతి చెంది ఉంటాడని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టూ పక్కల వారిని విచారించగా మృతుడు గత కొంత కాలంగా అక్కడే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని అతనికి ఎవరు బంధువులు లేరని తెలుసుకొని మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం రుద్ర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అందజేసినట్లు తెలిపిన పెద్దకాకాని పోలీసులు తెలిపారు.
Latest News