by సూర్య | Fri, Jan 14, 2022, 12:30 PM
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి ఉండవల్లి లో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేస్తున్నారు. రోజు రోజుకు తాడేపల్లిలో వీరి ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఉండవల్లి లో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దారి దోపిడీకి ప్రయత్నించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అంజి అనే వ్యక్తి విజయవాడ పటమాట రైతు బజార్ లో విధులు ముగించుకుని ఇంటికి తిరుగుప్రయాణం అయ్యాడు. ఈ మేరకు ఉండవల్లిలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈమని ఫణి కుమార్, అనంత సందీప్, పలగాని చంద్రమౌళి లు అంజీ కారును అడ్డుకున్నారు. అంజి మీద దాడి చేసి కారులోని డబ్బులు చోరీ చేసేందుకు యత్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి అతని మీద దాడి చేసి గాయపరిచారు. స్థానికులు రావడంతో పరారయ్యారు. దీంతో అంజి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
Latest News