by సూర్య | Fri, Jan 14, 2022, 12:29 PM
గుంటూరు జిల్లా తాడేపల్లి లో కోడి పందాలా స్థావరాలపై మంగళగిరి ఎస్ఈబీ సిఐ మారయ్యబాబు, సిబ్బందితో కలిసి శుక్రవారం మొరుపుదాడులను నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కోడిపందాలు నిర్వహిస్తున్న సందర్బంగా ఈ దాడులు నిర్వహించినట్లు సిఐ మారయ్యబాబు తెలిపారు. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి అటవీ ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ఉండవల్లి కొండ ప్రాంతంలో 9 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 6650 నగదు, 4 పందెంకోళ్లు, 22 కోడి కత్తులు, 9 మొబైల్ ఫోన్ లు, 2 బైకు లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ దాడులలో ఎస్ఈబీ ఎస్సైలు మల్లికార్జున రావు, ఎండీ షరీఫ్, శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, పి రమేష్, హనుమంతరావు, ఎం నాగరాజు, పి నారాయణ, వీరాంజనేయులు, ఎస్ వీ వీ ప్రసాద్, ఎల్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Latest News