by సూర్య | Fri, Jan 14, 2022, 12:35 PM
గుంటూరు: హైవే పై లారీ బోల్తా పడి పెను ప్రమాదం తప్పిన సంఘటన వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామం చోటుచేసుకుంది. కర్నూలు నుండి ఒరిస్సాకు శనక్కాయల లోడుతో వెళ్తున్న లారీ కొత్తపాలెం గ్రామం వద్దకు వచ్చేసరికి లారీ జాయింట్ రాడ్ విరగడంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ లో డ్రైవర్ సేఫ్ గా బయటపడ్డాడు. ఖైదీ పోలీసులొచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని క్రేన్ సాయంతో ప్రక్కకు నెట్టించారు.
Latest News