పునాది లేకుండానే ఇంటి నిర్మాణం.. బోలెడంత ఆదా!

by సూర్య | Fri, Jan 14, 2022, 12:23 PM

పునాది పటిష్టంగా ఉంటే ఇల్లు దృఢంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కర్ణాటకలోని మైసూర్ కు చెందిన ఓ ఆర్కిటెక్ట్ మాత్రం పునాది లేకుండానే ఇంటి నిర్మాణం చేపడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే రెండు ఇళ్లను నిర్మించి తన ప్రతిభ ఏంటో చూపిస్తున్నాడు. శరత్‌ కుమార్‌ అనే ఆర్కిటెక్ట్ రెండేళ్ల పాటు ఓ విదేశీ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పని చేశాడు. ఈ క్రమంలో పునాది లేకుండా ఇల్లు నిర్మించే టెక్నాలజీపై పట్టు సాధించాడు. మూడు సరికొత్త పద్ధతులను అవలంభిస్తూ కర్ణాటకలో పునాది లేని ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టాడు. ఈ విధానంలో 30-40 శాతం ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నాడు. ఈ పద్దతిలో నిర్మించే ఇంటికి ట్రాక్టర్‌ ద్వారా 7 అడుగుల లోతు వరకు రంధ్రం చేసి పిల్లర్‌ను ఏర్పాటు చేస్తారు. రెండోది ప్లింత్‌ బీమ్‌ ఏర్పాటు చేసి. మూడోది స్లాబ్‌ ఆన్‌ గ్రేడ్‌ పద్ధది ద్వారా ఇంటి నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ పద్దతిలో కేవలం 3 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని, నిర్మాణానికి కాంక్రీట్‌ ఉపయోగించటం వల్ల ఇల్లు 75-100 ఏళ్ల పాటు మన్నికగా ఉంటుంది చెబుతున్నాడు శరత్. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Latest News

 
ప్రజలు పన్నుకడుతుంటే మీడియాకు వచ్చిన ఇబ్బంది ఏమిటీ Mon, Jun 05, 2023, 09:48 PM
ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాలకు విశాఖ హబ్‌ కావాలి,,,సీఎం జగన్ Mon, Jun 05, 2023, 09:21 PM
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో గుడివాడ అమర్నాథ్ Mon, Jun 05, 2023, 09:20 PM
శాంతి యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్ Mon, Jun 05, 2023, 09:20 PM
ట్రాక్టర్ బోల్తా ఘటన దురదృష్టకరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Mon, Jun 05, 2023, 09:19 PM