by సూర్య | Fri, Jan 14, 2022, 10:18 AM
రాజమండ్రి నగరంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం భోగి సందర్భంగా పలు చోట్ల భోగీ మంటలు వేశారు. వీధుల్లో, గల్లీల్లో పిల్లలు భోగీ మంటల వద్ద చేరుకొని సందడి చేశారు. ఈ సందర్భంగా రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ద్వారా అందరికీ శుభం కలగాలని, దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆమె అన్నారు.
Latest News