by సూర్య | Fri, Jan 14, 2022, 10:25 AM
తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది.వైఎస్సార్ కడప జిల్లా: భోగి పండగ సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా బంధువుల ఇంట్లో ఏర్పాటు చేసిన భోగి సంబరాల్లో పాల్గొన్నారు. సంబేపల్లె మండలం, శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. తన సోదరుడు మాజీ జడ్పీటీసీ ఉపేంద్రరెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే రోజా పాత రోజులు గుర్తు చేసుకున్నారు.పలువురు రాజకీయ ప్రముఖులు వారి ఇళ్ల వద్ద భోగి మంటలు వేసి.. ప్రజలుకు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Latest News