by సూర్య | Thu, Jan 13, 2022, 09:57 PM
రోడ్డు ప్రమాదం లో గాయపడిన ఓ బైకర్కు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ అండగా నిలిచారు. చండీగఢ్లోని ఓ ప్రాంతానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో సీఎం చన్నీ తన కాన్వాయ్ను ఆపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ను పిలిపించి సకాలంలో వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Latest News