రెండు వర్గాల మధ్య కక్షల వల్ల ఆ హత్య జరిగింది

by సూర్య | Thu, Jan 13, 2022, 11:03 PM

తోట చంద్రయ్య హత్య రెండు వర్గాల మధ్య కక్షల వల్ల జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  తెలిపారు. ఇదిలావుంటే గుంటూరు జిల్లా మాచర్ల నియోజకర్గంలోని గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు గురికావడం రాజకీయ దుమారం రేపింది. వైసీపీ గూండాలే చంద్రయ్యను హత్య చేశారంటూ టీడీపీ అధినాయకత్వం ఆరోపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రయ్య హత్య రెండు వర్గాల మధ్య కక్షల వల్ల జరిగిందని తెలిపారు. అంతే తప్ప, ఈ హత్యతో వైసీపీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలకు తాను చాలా దూరంగా ఉంటానని, ఆ దిశగా ఎవరినీ ప్రోత్సహించనని వెల్లడించారు. చంద్రయ్య హత్య నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM