యుపీలో మరో బీజేపీ మంత్రి రాజీనామా

by సూర్య | Thu, Jan 13, 2022, 04:54 PM

ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా ప్రస్తుతం మరో మంత్రి యోగీ ఆధిత్య నాథ్ పార్టీకి రాజీనామా చేశారు. మూడు రోజుల్లో ఇది తొమ్మిదో రాజీనామా. ముగ్గురు మంత్రులతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు, బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా యూపీ మంత్రి వర్గంలో ఉన్న ధరమ్ సింగ్ సైనీ రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే ఓబీసీ కీలక నేత మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. బీజేపీ విధానాల వల్ల ఓబిసీలు నష్టపోతున్నారని.. వీరంతా రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసిన వారంతా.. సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అయితే మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM