by సూర్య | Thu, Jan 13, 2022, 02:48 PM
చిత్తూరు: ఐరాల మండలం, దివిటివారిపల్లి దగ్గర అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. 1000 లీటర్ల నాటుసారాను, నాటుసారా తయారీకి ఉపయోగించే ఊట, ఐదు బస్తాల చెక్కను ధ్వంసం చేశారు. 10 లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నాటుసారాను ఎవరూ కూడా తయారు చేయరాదన్నారు. నాటుసారాను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Latest News