by సూర్య | Thu, Jan 13, 2022, 12:42 PM
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయం అయ్యాయి. దాంబాస్కో బ్రిడ్జీపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దేవస్థానం వీధి బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద కాలువలు పొంగిపొర్లడంతో వీధుల్లోకి మురుగు చేరి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆలయం వద్ద భక్తులు చెల్లాచెదురుగా టెంట్లు కిందకు చేరారు.
Latest News