by సూర్య | Thu, Jan 13, 2022, 12:40 PM
నెల్లూరు : అధికారపార్టీ నేత తమ స్థలం కాజేశాడని ఆరోపిస్తూ నెల్లూరులో ఓ కుటుంబం అర్థరాత్రి ఆందోళనకు దిగింది. న్యాయం చేయాలంటూ నడిరోడ్డుపై కూర్చుంది. పుత్తా ఎస్టేట్ లో తమకు పదెకరాల స్థలం ఉంటే.. అందులో వైకాపాకు చెందిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లేఅవుట్ వేసి అమ్మేశారని వాపోయారు. తమకు నాలుగున్నర కోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకుని.... ఇప్పుడు ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి చిన్నబజార్ స్టేషన్ కు తరలించారు.
Latest News