నేడు సీఎం జగన్ ను కలవనున్న మెగాస్టార్

by సూర్య | Thu, Jan 13, 2022, 11:48 AM

ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం కలవనున్నారు. ఏపీలో సినిమా టికెట్ల విషయంపై సీఎం జగన్ తో చిరంజీవి చర్చించనున్నారు. సినిమా టికెట్ల ధరల వివాదం ముదురుతున్న కారణంగా చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలిసేందుకు చిరంజీవికి సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఇరువురు కలిసి లంచ్‌ చేయనున్నారు. సీఎం జగన్‌ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి చిరు చర్చించే అవకాశం ఉంది. సినీ పరిశ్రమపై పలువురు వైసీపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను చిరంజీవి సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM