by సూర్య | Wed, Jan 12, 2022, 12:56 PM
గుంటూరు, తాడికొండ: మేడికొండూరులో గృహిణి అదృశ్యంపై మంగళవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై నరహరి తెలిపిన మేరకు.. మండలంలోని పాలడుగు గ్రామవాసి చల్లా రాజుతో పెదకూరపాడు మండలం బుస్సాపురం వాసి భవానీకి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈనెల 7న తిరునాళ్లు కోసం భవాని పుట్టింటికి వెళ్లి వచ్చింది. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవ తలెత్తడంతో రాజు ఆమెపై చేయి చేసుకున్నారు. సోమవారం రాత్రి భవాని కనిపించకుండా పోయిందంటూ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Latest News