by సూర్య | Wed, Jan 12, 2022, 12:13 PM
అమరావతి : గుంటూరులో టీడీపీ రాస్తారోకో..గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద టీడీపీ రాస్తారోకో నిర్వహించింది. ప్రభుత్వం తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపై ధాన్యం పోసి రైతుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Latest News