by సూర్య | Wed, Jan 12, 2022, 12:11 PM
కారుణ్య మరణాలపై ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా కొలంబియాకు చెందిన ఓ వ్యక్తి తొలి కారుణ్య మరణాన్ని పొందాడు. కోర్టు అంగీకారంతో పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ప్రాణాలు విడిచాడు. విక్టర్ ఎస్కో బార్ అనే వ్యక్తి చాలాకాలం నుంచి ఊపిరితిత్తుల సమస్య, డయాబెటిస్, గుండె జబ్బుతో పోరాడుతున్నాడు. జీవితంలో ఆనందం అనేదే లేకుండా చేసే పరిస్థితి ఇది. దీంతో తాను చనిపోవాలనుకుంటున్నాని కోర్టుకు విన్నవించుకున్నాడు. కానీ లాయర్లు, స్వచ్ఛంద సంస్థలు ఇందుకు వ్యతిరేకించాయి. అయితే రెండేళ్లుగా తనకు మరణం ప్రసాదించాలని విక్టర్ ఎస్కో బార్ పోరాటం సాగిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో పీటర్ కారుణ్య మరణానికి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అంగీకారంతో కుటుంబసభ్యులు చూస్తుండగానే వైద్యులు సైనెడ్ను శరీరంలోకి ఇంజెక్ట్ చేశారు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోతున్నారు.
Latest News