by సూర్య | Tue, Jan 11, 2022, 09:39 PM
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగులతో టాప్ స్కోర్ చేసాడు. పుజారా 43, పంత్ 27 పరుగులు చేసాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడా 4 వికెట్లు, మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీశారు. ఒలివర్, ఎంగిడి, మహరాజ్ తలో వికెట్ తీశారు.
Latest News