by సూర్య | Tue, Jan 11, 2022, 10:59 PM
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్ మోహన్ రెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సాగర్ కుడి కాల్వలోకి దూసుకెళ్లింది. దుర్గి మండలం అడిగొప్పుల దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మదన్ మోహన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు. కారులో ఉన్న ఆయన భార్య, పిల్లలు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Latest News