వైసీపీకి ఓటు వేయలేదని ఈబిసి నిలిపివేత

by సూర్య | Tue, Jan 11, 2022, 03:58 PM

గుంటూరు: ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని కొంతవరకు అగ్రవర్ణాల మహిళలకు ఈ బీసీ ఇవ్వకుండా స్థానిక అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని శావల్యాపురం మండలం వేల్పూరు, కారుమంచి గ్రామానికి చెందిన మహిళలు తమ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్యెల్యే అధికారులతో కలసి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.


అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా ఉన్నాయని డబ్బులు జమ అవుతాయని అప్పట్లో వెయ్యి చొప్పున వసూలు చేశారన్నారు. కానీ ఇప్పుడు వారికి అనుకూలమైన వారి నుంచే బయోమెట్రిక్ తీసుకుంటున్నారని ఏంటని వాలంటీర్ లను అడిగితే సమాధానం కూడా చెప్పడం లేదన్నారు. ఇప్పటికే దీనిపైనే కలెక్టర్ ఆఫీసులో లో జరిగే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశామన్నారు.

Latest News

 
లింగాలలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్ Sat, May 04, 2024, 01:44 PM
200 కుటుంబాలు టిడిపిలో చేరిక Sat, May 04, 2024, 12:28 PM
విజయవాడ కనకదుర్గ గుడిలో అధికారి రాసలీలలు Sat, May 04, 2024, 12:10 PM
కమలాపురం పరిధిలో ఏపీఎస్పీ బలగాలతో పోలీసుల కవాతు Sat, May 04, 2024, 12:09 PM
ఎమ్మెల్యేగా గెలిస్తే సాగు, తాగునీరు అందిస్తాం Sat, May 04, 2024, 11:44 AM