by సూర్య | Tue, Jan 11, 2022, 01:49 PM
అనంతపురం ఇలా హిందూపురం పట్టణంలో టిడిపి పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యవసర సరుకులు పెరుగుతున్నాయని దీనిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు గ్యాస్ సిలిండర్ల ధరలు వెంటనే తగ్గించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వినూత్నంగా గ్యాస్ సిలిండర్, కూరగాయలను, కట్టెలను మోస్తూ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News