జనవరి 31 వరకు కర్ఫ్యూ.. వీటికి మినహాయింపు!

by సూర్య | Tue, Jan 11, 2022, 01:51 PM

ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తాజాగా కర్ఫ్యూ కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపు ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు నైట్ కర్ఫ్యూ నుంచి మింహాయింపు ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని లేకుంటే జరిమానా విధిస్తామని తెలిపింది. పెళ్లిళ్లు, మతపరమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశాల్లో 200, ఇండోర్ లో 100 కంటే ఎక్కువ మంది హాజరుకావొద్దని ఆదేశించింది. 50 శాతం కెపాసిటీతో థియేటర్లు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Latest News

 
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM
లోకం మాధవి ఆస్తుల విలువ తెలిస్తే షాకె Sat, Apr 20, 2024, 02:08 PM