by సూర్య | Mon, Jan 10, 2022, 10:21 PM
మహమ్మారి మళ్లీ చెలరేగుతుండడంతో ఏపీ సీఎం జగన్ నూతన మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. ఈ ఆర్టీసీ బస్సుల్లో మాస్కుల్లేకుండా ఎక్కితే జరిమానా విధిస్తారంటూ ప్రచారం జరిగింది. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. బస్సుల్లో మాస్క్ లేకుండా ప్రయాణించేవారికి జరిమానా విధించలేదని అని తెలిపారు. కేవలం ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో, పరిసరాల్లో వాహనాలు నిలిపి ఆర్టీసీ బస్సులకు ఇబ్బంది కలిగించినా, మాస్కులు లేకుండా తిరగడం లాంటివి నియంత్రించడంలో భాగంగా అధికారులు జరిమానా విధిస్తారంటూ తెలిపారు.