అటు కేసుల దూకుడు...ఇటు పెరుగుతున్న మరణాలు

by సూర్య | Mon, Jan 10, 2022, 08:28 PM

దేశంలో కరోనా మరోసారి తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. కరోనా కేసులు పెరగడమే కాకుండా మరణించే వారి సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,79,723 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 146 మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,57,07,727 కేసులు నమోదు కాగా వీరిలో 4,83,936 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 7,23,619 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రాలవారీగా చూసుకుంటే మహారాష్ట్రలో అత్యధికంగా 44,388 కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ల్లో 24,287, ఢిల్లీలో 22,751, తమిళనాడులో 12,895, కర్ణాటకలో 12000 కేసులు, కేరళలో 6238 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాల్లో సామాన్యులతో పాటు డాక్టర్లు, రాజకీయ ప్రముఖులు, పోలీసులకు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. ఫ్రంట్ లైన్ వర్కర్లు కరోనా బారిన పడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను మరింత పెంచుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూలతో వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోని వారిని బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అవకాశం ఇవ్వడం లేదు. అలాగే స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్ మూతబడ్డాయి. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌‌లో లక్షల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.

Latest News

 
గొడవలు పడకుండా సమన్వయం పాటించండి: శెట్టిపల్లి రఘురాంరెడ్డి Fri, May 17, 2024, 03:29 PM
ఆధ్యాత్మిక కేంద్రంలోతీరని డ్రైనేజీ సమస్యలు Fri, May 17, 2024, 02:56 PM
ఉప్పర సగర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు Fri, May 17, 2024, 02:55 PM
గుర్తుతెలియని వ్యక్తి మృతి Fri, May 17, 2024, 02:49 PM
చిలమత్తూరు ఎంపీపీ, మరో 35 మందిపై కేసు Fri, May 17, 2024, 02:45 PM