చంద్రుడిపై నీటి బొటును కొనుగోన్నారు

by సూర్య | Mon, Jan 10, 2022, 08:27 PM

చంద్రమండలంపై నివాస ప్రయత్నాలు..పరిశోధనలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. చంద్రమండలంలో నీటి బొట్టును చైనా వ్యోమనౌక యాత్రికులు కనిపెట్టారు. చంద్రుడిపై నీటి జాడ గురించి ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రుడిపై నీళ్లు ఉన్నాయని గతంలో కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. అప్పట్లో చంద్రుడిపై నీరు ఉన్నట్టు కచ్చితమైన ఆధారాలను నాసా విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి ఆ విషయం రుజువైంది. చైనా వ్యోమనౌక ల్యాండర్‌ చాంగే-5 చందమామపై నీటి ఆనవాళ్లను కనుగొంది. అక్కడ ల్యాండ్ అయి పరిశోధన చేసి గుర్తించడం ఇదే తొలిసారి. ల్యాండర్‌ చాంగే-5లో ఉన్న ప్రత్యేక పరికరం సాయంతో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు. వ్యోమనౌక ల్యాండర్‌ ఉన్న ప్రదేశంలో 120 పీపీఎం మేర నీరు ఉన్నట్టు తెలిసింది. తేలికైన, వెసిక్యులర్‌ శిలలో 180 పీపీఎం మేర నీటి ఆనవాళ్లు ఉన్నట్టు వెల్లడైంది. భూమి మీదతో పోలిస్తే ఈ శిలలు చంద్రుడిపై ఎక్కువ పొడిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహాల ద్వారా రిమోట్‌ సెన్సింగ్‌ పద్ధతిలో పరిశీలించినప్పుడు చంద్రుడిపై నీటి జాడను పరిశోధకులు గతంలోనే గుర్తించారు. ఇప్పుడు చైనా వ్యోమోనౌక చాంగే-5 ల్యాండర్‌.. శిలలు, ఉపరితలంపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై కనిపించే తేమలో ఎక్కువభాగం.. సౌర గాలుల ద్వారా వచ్చిందేనని పరిశోధకులు తెలిపారు. ఇదిలావుంటే 2008లో ఇస్రో పంపిన చంద్రయాన్‌-1 అంతరిక్ష నౌక ద్వారా సేకరించిన డేటా ఆధారంగా కూడా చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేయాలని నాసా ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది. చంద్రుడిపై ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని స్థావరాన్ని కొనసాగించాలనేది నాసా లక్ష్యం. అయితే చంద్రుడిపై నీరు ఎక్కువగా లభించే చోట స్థావరం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరీ చంద్రుడిపై నీరు ఎక్కడుంది.. ఎంత ఎక్కువ ఉందనేదానిపై ఇంకా పరిశోధనలు సాగాలి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM