by సూర్య | Thu, Nov 18, 2021, 05:39 PM
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతోంది. దీంతో కీలక ఆర్డినెన్స్లపై ఫోకస్ పెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. అయితే ఏపీలో ఇంకా ముఖ్యమైన సమస్యలున్నాయని, వాటిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తే నష్టమేంటని తెలుగు దేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.కానీ జగన్ సర్కారు మాత్రం కేవలం వారం రోజుల పాటు పొడగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. అంటే ఈ నెల 26 వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
Latest News