by సూర్య | Wed, Nov 17, 2021, 12:31 PM
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకుంది . అయితే మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. 8వ వార్డు టీడీపీ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందినట్లు అధికారులు తొలుత ప్రకటించారు. దీంతో వైసీపీ అభ్యర్థి రీకౌంటింగ్ కోరగా మళ్లీ ఓట్లు లెక్కించారు. అనంతరం ఒక్క ఓటుతో వైసీపీ అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. వైసీపీకి 2 చెల్లని ఓట్లు వేసి ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించారు అని టీడీపీ అభ్యర్థితోపాటు నేతలు ఆందోళనకు దిగారు.
Latest News