by సూర్య | Tue, Nov 16, 2021, 11:00 PM
మహారాష్ట్రలో సీహోర్ జిల్లాలో ఒక యువతి సంవత్సరం క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని బిల్కిస్గంజ్ లో నివాసం ఉంటోంది. ఈ మధ్య ఆమె తన అక్క ఇంటికి వచ్చింది. అయితే ఈ నెల 4న యువతి కొడుకు అనారోగ్యంతో మృతిచెందాడు. దాంతో చిన్నారి అంత్యక్రియలు చేసెందుకు బాధితురాలి అక్క తన తండ్రిని పిలిచింది. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన తండ్రి.. కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే కోపంలోనే ఉన్నాడు. అంత్యక్రియల కోసమని చెప్పి కూతురును తండ్రి తన బండిపైన అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగికదాడికి పాల్పడి దారుణంగా హత్య చేశాడు.ఆదివారం బాధితురాలు, ఆమె పక్కనే ఆరునెలల శిశువు మృతదేహాలను ఓ ఫారెస్ట్ గార్డ్ గుర్తించడంతో అసలు విషయం తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు ప్రేమ పెళ్లి చేసుకోవడం పట్ల తన కుటుంబం కోపంగా ఉందని.. అందుకే ఆమెను హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు.
Latest News