by సూర్య | Tue, Nov 16, 2021, 11:18 PM
రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ తో కర్నూలు జిల్లా లో న్యాయ రాజధానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తూ..ఆందోళనకు దిగారు . కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయాన్ని చుట్టూముట్టెందుకు ప్రయత్నించారు. దాంతో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు .అపుడు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ పార్టీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో సీమను నయవంచనకు గురిచేస్తోందని చెప్పారు. కర్నూలు జిల్లా లో హైకోర్టు ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించిన బీజేపీ.. అమరావతి రాజధాని కావాలనడంపై మండిపడ్డారు. బీజేపీకి రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్గా గుర్తించాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నుంచి కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలమని ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేశారు.
Latest News