by సూర్య | Tue, Oct 26, 2021, 01:06 PM
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ చార్జిలతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.
Latest News