రేషన్ డీలర్లకు టీడీపీ మద్దతు : అచ్చెన్నాయుడు

by సూర్య | Tue, Oct 26, 2021, 12:55 PM

రేషన్ డీలర్లకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలిందని విమర్శించారు. డీలర్లను కేవలం స్టాకిస్టులంటూ.. జగన్ రెడ్డి. నామమాత్రం చేస్తున్నారని మండిపడ్డారు. నాడే గౌరవ వేతనం.. నేడు ఉంటామో ఊడుతామోనని భయం నెలకొందన్నారు. వాలంటీర్లు, మొబైల్ వాహనాలతో డమ్మీలుగా రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. కరోనా సమయంలో జగన్ ఉచిత రేషన్ కమిషన్ కూడా ఇవ్వలేదన్నారు. 54 మంది డీలర్లు కరోనాతో మృతి చెందినా పరిహారం శూన్యమని అన్నారు. టీడీపీ హయాంలో మినీ సూపర్ మార్కెట్లుగా రేషన్ షాపులు ఉన్నాయని చెప్పారు. నేడు బియ్యం, పంచదార, పప్పులకు జగన్ పరిమితం చేశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM