సంతానం కలగాలని దారుణం.. మూఢనమ్మకానికి ఇద్దరు బలి!

by సూర్య | Tue, Oct 26, 2021, 08:47 AM

పిల్లలు కలగాలని ఓ జంట ఇద్దరు మహిళలను హత్యచేశారు. భూతవైద్యుడు ఆశ్రయించి ఇద్దరు మహిళలను బలి ఇచ్చారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌కు చెందిన బంటు బదౌరియా, మమత దంపతులకు పెళ్లై 18 ఏళ్లయినా ఇప్పటివరకు సంతానం కలగలేదు. దీంతో వారు భూతవైద్యుడిగా చెప్పుకుంటున్న గిర్వార్‌ యాదవ్‌ ను ఆశ్రయించారు. ఓ వ్యక్తిని బలిస్తే సంతానం కలుగుతుందని ఆ మాంత్రికుడు ఆ దంపతులకు చెప్పాడు. ఈ క్రమంలో ఈనెల 13న బంటు ఓ సెక్స్‌ వర్కర్‌ ను తీసుకువచ్చాడు. ఆమెను హత్య చేసి రోడ్డు పక్కన తుప్పల్లో పడేసి పరారయ్యాడు. వారం రోజుల తర్వాత అక్టోబర్‌ 20న మరో సెక్స్‌ వర్కర్‌ ను ట్రాప్‌ చేసి మత్తుమందు ఇచ్చారు. ఆమెను భూతవైద్యుని వద్దకు తీసుకెళ్లి బలిచ్చారు. మొదట హత్యకు గురైన మహిళ మృతదేహం ఈ 21న లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ప్రధాన నిందితుడు నీరజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో భూతవైద్యుడు సహా ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM