by సూర్య | Tue, Oct 26, 2021, 08:29 AM
ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్ చేయడంతోపాటు మైక్రోసాఫ్ట్లాంటి సంస్థలతో నిరంతరం శిక్షణ కొనసాగించాలని చెప్పారు. అప్పుడు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్గా పరంగా వచ్చిన తేడా ఏంటి అన్నది స్పష్టంగా కనిపించాలని అధికారుల్ని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ లాంటి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్శిటీలు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.
Latest News