by సూర్య | Mon, Oct 25, 2021, 08:18 PM
గుంటూరు జిల్లా జైలు నుంచి టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం విడుదలయ్యారు. తనపై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపారని అన్నారు. అక్రమ అరెస్ట్లకు తాను భయపడనన్నారు. కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మేడికొండూరు సీఐ మారుతి తనపై చేయిచేసుకున్నారని చెప్పారు. అలాగే నాగార్జునసాగర్ స్టేషన్లో రాత్రంతా నిర్బంధించారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.
Latest News