by సూర్య | Mon, Oct 25, 2021, 08:11 PM
బాలుడిని చంపిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. జిల్లాలోని కె.వి పల్లి మండలం, ఎగువ మేకలవారిపల్లిలో ఈ నెల 12వ తేదీన తేజేష్ రెడ్డి(8) అనే బాలుడు హత్యకు గురయ్యాడు. రెడ్డి హత్య కేసులో నిందితులు నందకుమార్ రెడ్డి అలియాస్ ఉదయ్ని కె.వి పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బాలుడిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. లైంగిక దాడిని బయటపెడతాడన్న భయంతోనే తేజేష్రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Latest News