by సూర్య | Mon, Oct 25, 2021, 11:01 AM
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్తోపాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.ఏపీ ఈఏపీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లౌన్ కౌన్సెలింగ్లో పాల్గొంటారు. నేటి నుంచి ఈనెల 30 వరకు విద్యార్థులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈనెల 26 నుంచి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. నవంబర్ 6 నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. అనంతరం నవంబర్ 10న విద్యార్థులకు సీట్లు అలాట్ చేస్తామన్నారు. అదేవిధంగా నవంబర్ 15 తేదీలోపు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని, అదే రోజునుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
Latest News