ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయడు

by సూర్య | Mon, Oct 25, 2021, 10:59 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రబాబు బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఏపీ పరిస్థితిని వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు.అలాగే టీడీపీ కార్యాలయం విధ్వంస ఘటనపై రాష్ట్రపతికి చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఏపీలో డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్రపతికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. టీడీపీ నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కోరారు. మరికొందరు కేంద్రమంత్రుల్ని కూడా కలుస్తామని టీడీపీ నేతలు తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM