భారత్ లో కొత్తగా 14,306 కరోనా కేసులు

by సూర్య | Mon, Oct 25, 2021, 11:13 AM

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,306 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 443 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,67,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 239 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.దేశంలో అత్యధిక కేసులు కేరళలో నమోదయ్యాయి. కేరళలో గత 24 గంటల్లో 8,538 కేసులు నమోదు కాగా… 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కి పెరిగాయి. ఇప్పటి వరకు 4,54,712 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Latest News

 
కొమ్ముగూడెంలో కూటమి విస్తృత ఎన్నికల ప్రచారం Wed, May 08, 2024, 12:52 PM
17 మెడికల్‌ కాలేజీలు అభివృద్ధి కాదా? Wed, May 08, 2024, 12:01 PM
చంద్ర‌బాబు తక్ష‌ణ‌మే ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి Wed, May 08, 2024, 12:00 PM
దళిత మహిళా ఐన నాపైన దాడికి దిగడం దారుణం Wed, May 08, 2024, 11:59 AM
పెత్తందారులతో సమరానికి పేదలు సిద్ధం అయ్యారు Wed, May 08, 2024, 11:57 AM