by సూర్య | Sun, Oct 24, 2021, 12:03 PM
బద్వేలు లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ప్రజలకు ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిచిందని అన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధని భారీ మెజార్టీతో గెలిపించాని ప్రజలను కోరారు.
Latest News