by సూర్య | Sun, Oct 24, 2021, 11:04 AM
దేశంలో గత 24 24 గంటల్లో కొత్తగా 15,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 561 మంది కరోనాతో మృతి చెందగా 16,479 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,75,468కు చేరింది. అందులో 3,35,48,605 మంది కోలుకున్నారు. మరో 4,54,269 మంది మృతిచెందారు. దేశంలో ఇంకా 1,72,594 కేసులు యాక్టివ్లో ఉన్నాయి.
Latest News