by సూర్య | Sat, Oct 23, 2021, 03:00 PM
టీమిండియాకు మరో కప్ అందించడం కోసం ఇప్పటికే మాజీ సారథి ధోనీని రంగంలోకి దింపింది బీసీసీఐ. టీమిండియాకు మెంటార్ గా నియమించింది. టీ20, వన్డే కప్ ప్రపంచ కప్ లను అందించిన అతడి అమూల్యమైన సలహాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయని భావించి అంత పెద్ద బాధ్యతను అప్పగించింది. అయితే, తాజాగా మరో బాధ్యతనూ ధోనీ భుజాలకు ఎత్తింది బీసీసీఐ. మరో కొత్త పాత్రను అందించింది. 'టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్' అంటూ బీసీసీఐ ట్విట్టర్ లో వెల్లడించింది.రేపు దాయాది పాకిస్థాన్ తో భారత్ తన తొలి మ్యాచ్ లో తలపడనున్న సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ కోసం జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పై కఠోర సాధన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ధోనీ బ్యాటర్లకు బాల్ ను విసురుతూ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఆ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన బీసీసీఐ.. 'టీమిండియా నూతన త్రోడౌన్ స్పెషలిస్ట్ ను పరిచయం చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేసింది.
Latest News