భర్తను కాదని మరొకరితో ఎఫైర్.. చివరకు దారుణం

by సూర్య | Sat, Oct 23, 2021, 07:36 AM

అల్లుడితో గొడవపడి పుట్టింటికొచ్చిన కూతురు మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని కన్న తల్లిదండ్రులే ఓ మహిళను హత్య చేశారు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగింది.  పరమకుడి సమీపంలోని నాందుపట్టి గ్రామానికి చెందిన తెన్నారాసు, అమృతవల్లి దంపతులకు కౌసల్య అనే కూతురు ఉంది. కౌసల్యకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్ని నెలలకే భర్తతో కౌసల్యకు మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో 4 నెలల క్రితం కౌసల్య పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో పాటే కలిసి ఉంటోంది. ఈ క్రమంలో కౌసల్య అదే గ్రామంలో ఉంటున్న ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కొన్ని రోజులకు ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. భర్త దగ్గరకు వెళ్లిపోవాలని, ఇక్కడ ఉండి ఇవేం పనులని కూతురిని మందలించారు. తల్లిదండ్రులతో తరచూ గొడవలు జరుగుతుండడంతో కౌసల్య ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇరుగుపొరుగు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన కౌసల్యకు డాక్టర్లు చికిత్స మొదలుపెట్టేలోపే కౌసల్యను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆమెను గొంతు నులిమి చంపేశారు. ఎలుకల మందు తాగడం వల్ల తమ కూతురు చనిపోయిందని నాటకం ఆడారు. పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వెంటనే అంత్యక్రియలు చేశారు. పోలీసులు ఈ ఘటనలో కౌసల్య తల్లిదండ్రులను అరెస్ట్ చేసి వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM