by సూర్య | Fri, Oct 22, 2021, 07:52 PM
ద్వారకాతిరుమల శ్రీ వారి క్షేత్రంలో ఈనెల 15 నుంచి 22 వరకు జరిగిన కల్యాణ మహోత్సవాల సందర్బంగా నిలిపివేసిన నిత్యార్జిత సేవలు ఈనెల 23 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 9.30 గంటలకు నిత్యార్జిత కల్యాణాలు జరుగుతాయన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ స్వామిని దర్శించుకోవాలని ఈవో కోరారు.
Latest News